మంచిరేవుల ట్రాక్ పార్క్ : చిరుత చిక్కింది.. సాగర్ అడవులకు తరలించారు..

మంచిరేవుల ట్రాక్ పార్క్ : చిరుత చిక్కింది.. సాగర్ అడవులకు తరలించారు..

గత కొన్ని రోజులుగా నార్శింగ్​ మున్సిపాల్టీ మంచిరేవుల ట్రాక్​ పార్క్​ కు సమీపంలో నివసిస్తున్న ప్రజలను  బెంబేలెత్తిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు.  గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ఇటీవల   చిరుత సంచారం కలకలం రేపింది. 

ఇదే చిరుత  గత కొద్దిరోజులుగా మృగవని పార్క్, గ్రే హౌండ్స్, గోల్కోండ ప్రాంతాల్లో  సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దానిని బంధించేందుకు  14 ట్రాప్ కెమెరాలు,  మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత మంచిరేవులలోని ట్రెక్ పార్క్ లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు గురువారం ( జులై 31)   అమర్చిన బోనులో బంధించారు.  అందరినీ హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు పట్టుబడడంతో అధికారులతో పాటు జనం ఊపిరి పీల్చుకున్నారు. 

 అటవీశాఖ అధికారులు  చిరుత పులిని నాగార్జునసాగర్ అటవీ ప్రాంతానికి తరలించారు.
చిరుతను అధికారులు పట్టుకోవడంతో  మంచిరేవుల ట్రాకింగ్​ పార్క్​లో ఈ రోజు ( ఆగస్టు1) నుంచి  మార్నింగ్ వాకర్స్ కు ఇతర సందర్శకులకు పార్కును తెరిచారు. 

 సిటీ శివారు ప్రాంతాల్లో వాకర్స్​ కోసం  మంచిరేవుల ట్రిక్ పార్క్ లో  మాత్రమే అవకాశం ఉంది. గత 10 రోజులుగా  మార్నింగ్ వాకర్స్ గేటుకు తాళం చూసి చేసేదేమీ లేక ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్ పైన కొంతమంది. ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్ పై కొంతమంది వాకింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు....