తిరుమలలో చిరుత సంచారం కలకలం

తిరుమలలో చిరుత సంచారం కలకలం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరిమెట్ల దగ్గర రెండు చిరుతలు సంచరించడంతో భయాందోళనకు గురయ్యారు భక్తులు. చిరుతలను చూసి బిగ్గరగా కేకలు వేయడంతో.. అవి అడవిలోకి పారిపోయాయి.

ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులను గుంపులుగుంపులుగా పంపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుతల జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగారు అటవీ శాఖ అధికారులు.  చిరుతలను పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

గతంలో అలిపిరి నడకదారి మార్గంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి చిరుతలు సంచరిస్తుండడంతో భక్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.