చిన్నశంకర్ పేట తండాలో చిరుతపులి సంచారం

చిన్నశంకర్ పేట తండాలో చిరుతపులి సంచారం

గుట్టలపై సంచరిస్తోందని స్థానికుల భయాందోళన

మెదక్: జిల్లాలోని చిన్న శంకరంపేట్ మండలం కామారం తండా శివారులో చిరుతపులి సంచారం కనిపిస్తోంది. స్థానికులకు  చిరుత కనిపించినట్లు చెబుతున్నారు. గుట్టలలో స్థావరం ఎర్పాటు చెసుకుందని అనుమానిస్తున్నారు. కొందరు స్థానికులు కొండలపై చిరుత సంచారం ఫోటోలు తీసి మీడియాకు షేర్ చేయడంతో వైరల్ అయింది. చిరుతతోపాటు రెండు చిన్న పిల్లలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ధృవీకరించలేదు. అధికారులు ఎలాంటి ప్రకటన చేయకున్నా.. పరిసర ప్రాంత గ్రామస్థుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయంపై అటవీశాఖ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. చిరుత సంచారం గురించి నిర్ధారించుకునే పనుల్లో వారు బిజీగా ఉన్నట్లు సమాచారం.