తిరుమల నడకమార్గంలో చిక్కిన చిరుతలను వదిలేశిన్రు

తిరుమల నడకమార్గంలో చిక్కిన చిరుతలను వదిలేశిన్రు

తిరుమల నడక మార్గంలో చిక్కిన చిరుతల్లో రెండింటిని అధికారులు విడిచిపెట్టారు. తిరుమలలో గత నెలలో చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత ఏర్పాటు చేసిన బోనులో నాలుగు చిరుతలు చిక్కాయి. వాటిలో రెండు చిరుతలు చిన్నారిపై దాడి చేసినవి కాదని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. ఒక చిరుతకు పూర్తిగా దాడి చేసి చంపే స్థాయిలో దంతాలు ఎదగకపోవడం, మరొకటి నెలల కూనగా గుర్తించారు. దీంతో  నివేదిక ప్రకారం అటవీశాఖ బంధించిన రెండు చిరుతలను విడిచిపెట్టామని అధికారులు వెల్లడించారు.

రెండు నెలల్లో ఐదు చిరుతలు..

తిరుమలలో మెట్ల మార్గంలో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని బంధించారు అధికారులు. మొదట బంధించిన చిరుతను వెంటనే అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు.

ALSO READ: యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. ఉచిత దర్శనానికి గంట

ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయని వివరించారు.

చిన్నారి లక్షితపై దాడి చేసిన చంపేసిన తర్వాత అలిపిరి మార్గంలో 200 కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో చిరుతల కదలికలను అధికారులు గుర్తిస్తున్నారు.