బీఆర్ఎస్ ను తరిమికొడదాం : పరిగి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి

బీఆర్ఎస్ ను తరిమికొడదాం : పరిగి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి

పరిగి, వెలుగు: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి.. బీఆర్ఎస్ ను తరిమికొట్టాలని పరిగి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పరిగి మండలం తొండపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, పూడూరు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన యువకులు రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

అనంతరం పూడూరులోని మంచన్ పల్లి, గట్టుపల్లి, నిజాంపేట, మేడిపల్లి, కంకల్ పెద్ద ఉమ్మెంతాల్, పుడుగుర్తి, బార్లపల్లి, కేరవెల్లి, సిరియాలపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మోసాలను జనాలకు వివరించారు. ఆరు గ్యారంటీలను జనం నమ్ముతున్నారని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.