ఆ బ్రాండ్లు అమ్మకపోతే ఇదే చివరి ఓటు.. జగన్ కు తాగుబోతుల హెచ్చరిక

ఆ బ్రాండ్లు అమ్మకపోతే ఇదే  చివరి ఓటు.. జగన్ కు తాగుబోతుల హెచ్చరిక

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓట్ల లెక్కింపుల్లో భాగంగా బ్యాలెట్ బాక్సులో బయటపడ్డ ఓ లేఖ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పాత బ్రాండ్లు అయిన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ,  బ్లాక్ డాగ్ మందును వైన్ షాపుల్లో అమ్మేలా చేయాని తాగుబోతుల సంఘం సీఎం జగన్ కు లేఖ రాయడం గమనార్హం. నంద్యాల 29 వ వార్డులో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ లేఖ వచ్చింది. లేఖలో ఏముందంటే..‘ కర్నూల్ జిల్లా నంద్యాల మండలం నంద్యాల పరుపాలక సంఘం, గౌరవనీయులు సీఎం జగన్ కు తాగుబోతుల సంఘం యొక్క విన్నపం ఏమనగా కొత్త బ్రాండ్స్ సుప్రీం, దారు, హైదరాబాద్, జంబో లను రద్దు చేసి ఓల్డ్ బ్రాండ్స్ రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ లను అమ్మలవలెనని విన్నపం. లేకపోతే తామ ఓటు చివరి ఓట్లు కాగలవని విన్నవించుకుంటున్నాం ‘ అని ఉంది