11వేల 300కు చేరుకున్న మృతుల సంఖ్య.. 20వేలకు చేరొచ్చని అంచనా

11వేల 300కు చేరుకున్న మృతుల సంఖ్య.. 20వేలకు చేరొచ్చని అంచనా

లిబియాలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. వరదల ధాటికి రెండు డ్యామ్‌లు తెగిపోవడం అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఈ క్రమంలోనే లిబియా తీరప్రాంత నగరమైన డెర్నాలో మరణించిన వారి సంఖ్య 11వేల 300కి చేరుకుందని లిబియా రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఈ సంఖ్య 20వేలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. మెడిటరేనియన్ నగరంలో ఇంకా 10వేల 100 మంది ఆచూకీ దొరకలేదని సెక్రటరీ-జనరల్ మేరీ ఎల్-డ్రేస్ అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. తుఫాను కారణంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో 170 మంది మరణించారు.

Also Read :- హైస్కూల్ విద్యార్థిపై పెప్పర్ స్ప్రేతో దాడి

ఈ వరదలు డెర్నాలోని మొత్తం కుటుంబాలను తుడిచిపెట్టాయి. ఈ తుపాను తూర్పు లిబియా అంతటా ఉన్న కమ్యూనిటీలలో ఘోరమైన వరదలను కలిగించింది. అయితే లిబియాలో అత్యంత అత్యంత ఘోరంగా దెబ్బతిన్నది డెర్నా మాత్రమే. తుఫాను తీరాన్ని తాకడంతో, నగరం వెలుపల ఉన్న రెండు ఆనకట్టలు కూలిపోగా.. పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని నివాసితులు తెలిపారు. వరదలకు 72 గంటల ముందు జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందని, అన్ని ప్రభుత్వ అధికారులకు ఇమెయిల్ ద్వారా, మీడియా ద్వారా తెలియజేసిందని WMO ఈ వారం ప్రారంభంలో తెలిపింది.