ఫిట్‌‌‌‌ ఇండియా రన్‌‌‌‌ను నిర్వహించిన ఎల్‌‌‌‌ఐసీ హైదరాబాద్‌

ఫిట్‌‌‌‌ ఇండియా రన్‌‌‌‌ను నిర్వహించిన ఎల్‌‌‌‌ఐసీ హైదరాబాద్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సిటీలోని లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌ కార్పొరేషన్ జోనల్ ఆఫీస్ సోమవారం ‘ఫిట్‌‌‌‌ ఇండియా స్వచ్ఛత ఫ్రీడం  4.0’ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించింది.  ‘క్లీన్ ఇండియా, హెల్తీ ఇండియా’ థీమ్‌‌‌‌తో దీనిని నిర్వహించారు. ఈ ఫిట్ ఇండియా స్వచ్ఛత ఫ్రీడమ్‌‌‌‌ రన్‌‌‌‌ను  ఎల్‌‌‌‌ఐసీ జోనల్ మేనేజర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. జోనల్ ఆఫీస్‌‌‌‌ నుంచి మింట్ కాంపౌండ్‌‌‌‌, ఐమాక్స్‌‌‌‌, లుంబిని పార్క్‌‌‌‌, తిరిగి జోనల్ ఆఫీస్‌‌‌‌కు మధ్య 300 మంది ఉద్యోగులు పరుగు తీశారు. ఫ్లకార్డులు పట్టుకొని  స్లోగన్లు చేశారు. ఈ ఏడాది విజిలెన్స్‌‌‌‌ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ వారాన్ని సోమవారం నుంచి నవంబర్‌‌‌‌‌‌‌‌ 5 వరకు జరుపుతారు. 

‘సే నో టు కరప్షన్‌‌‌‌; కమిట్‌‌‌‌ టు ది నేషన్‌‌‌‌’ థీమ్‌‌‌‌తో ఈసారి విజిలెన్స్ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ వారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా యువత తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలని, హెల్త్‌‌‌‌పై అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ పెంచేందుకు ఈ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించామని జోనల్ మేనేజర్ ఎల్‌‌‌‌కే శామ్‌‌‌‌సుందర్ పేర్కొన్నారు. ప్రతి రోజు రన్నింగ్‌‌‌‌, ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ వంటివి చేస్తూ ఫిట్‌‌‌‌గా ఉండాలని సలహా ఇచ్చారు. అవినీతిని అరికట్టడం లాంగ్‌‌‌‌ ప్రాసెస్ అని, అన్ని వైపుల నుంచి చర్యలు తీసుకోవలసి ఉందని శామ్‌‌‌‌సుందర్ అన్నారు. విజిలెన్స్ అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌ వీక్‌‌‌‌లో యాక్టివ్‌‌‌‌గా పాల్గొనాలని ఉద్యోగులకు పిలుపిచ్చారు. 

అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంలో పాలుపంచుకోవాలని అన్నారు. పీ రమేష్ బాబు, ఆర్‌‌‌‌‌‌‌‌ సతీష్‌‌‌‌ బాబు, రాజేష్‌‌‌‌ భరద్వాజ్‌‌‌‌, ఉతప్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌, ఎంఎంపీ శ్రీనివాస్‌‌‌‌ రావు, రాజివ్‌‌‌‌ బిస్వాస్‌‌‌‌, తదితర సీనియర్ ఉద్యోగులు ఈ ఈవెంట్‌‌‌‌లో పాల్గొన్నారు.