పద్మారావునగర్, వెలుగు: పద్మారావునగర్ డెయిరీ ఫామ్ రోడ్డులోని అటవీ ప్రాంతంలో మనిషి పుర్రె కలకలం రేపింది. సోమవారం కనాజిగూడకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి అటుగా వెళ్తుండగా పుర్రె, ఎముకలు కనిపించాయి. డయల్ 100కు ఫోన్ చేయడంతో బోయిన్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వాటిని పరిశీలించారు. గాంధీ హాస్పిటల్కు తరలించి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
