జులై 21న 'లైగర్' థియేట్రికల్ ట్రైలర్

జులై 21న 'లైగర్' థియేట్రికల్ ట్రైలర్

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న  క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్'(సాలా క్రాస్‌బ్రీడ్).  ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అకట్టుకుంది. ఈ పాటకు ఇప్పటివరకు 30 మిలియన్ వ్యూస్  వచ్చాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుడటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగానే  సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేశారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చుట్టూ ఫైటర్‌లను వుండగా విజయ్ మధ్యలో ఉన్నాడు. మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్ పైన భారీ అంచనాలున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.