ఈ నెల 25న ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్

ఈ నెల 25న ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్​స్ర్కైబ్​’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో   సంతోష్ మాట్లాడుతూ ‘గాంధీతో ఆల్రెడీ ‘ఏక్‌‌‌‌ మినీకథ’ చేశాను. తను నాకు కథ కూడా చెప్పక్కర్లేదు. ఫార్మాలిటీకి వింటాను. తనపై నాకు అంత నమ్మకం. ఇదొక ఫన్ మూవీ. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అన్నాడు.

ఫరియా మాట్లాడుతూ ‘జాతిరత్నాలు తర్వాత ఎందుకు బ్రేక్ తీసుకున్నారని చాలామంది అడుగుతున్నారు. నాకు అవసరం అనిపించి బ్రేక్ తీసుకున్నా. గాంధీ మంచి స్క్రిప్ట్‌‌‌‌తో వచ్చారు. అడ్వెంచరస్ మూవీ. సంతోష్ చాలా సపోర్ట్‌‌‌‌ చేశారు. ఆయనతో వర్క్ చేయడం ఎనర్జీనిచ్చింది’ అని చెప్పింది. ‘ఈ సినిమాలో హీరో హీరోయిన్ ట్రావెల్ వ్లాగర్స్. అందుకే ఈ టైటిల్ పెట్టాం. బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి పాత్రలు ఫన్నీగా ఉంటాయి.  మూవీ అంతా  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా, అడ్వెంచరస్‌‌‌‌ ట్రిప్‌‌‌‌లా ఉంటుంది. ఈ నెల 25న ప్రభాస్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పాడు  మేర్లపాక గాంధీ.  ఔట్‌‌‌‌పుట్  బాగా వచ్చిందని, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకముందని నిర్మాత చెప్పారు.