అవినీతి కూపంలో లింగంపేట సొసైటీ.. ప్యాక్స్​లో రూ.73 లక్షలు దుర్వినియోగం

అవినీతి కూపంలో లింగంపేట సొసైటీ..  ప్యాక్స్​లో రూ.73 లక్షలు దుర్వినియోగం

లింగంపేట, వెలుగు: గతంలో జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా అవార్డులు అందుకున్న లింగంపేట కోఆపరేటివ్​ సొసైటీ నేడు అవినీతిలో కూరుకుపోయింది. ప్యాక్స్​ చైర్మన్​ దేవేందర్​రెడ్డి, సీఈఓ సందీప్ కలిసి రూ.73,08,322లను దుర్వినియోగం చేసినట్లు  విచారణలో వెల్లడైంది. ఈ మేరకు జిల్లా సహకార అధికారి(డీసీవో)  వసంత నివేదికను సీఈఓ సందీప్​కు అందజేశారు. పాలకవర్గ సభ్యుల తీర్మానం లేకుండానే సుమారు రూ.80లక్షల సొసైటీ నిధులను చైర్మన్,​ సీఈఓ కలిసి దుర్వినియోగం చేశారని గత ఏడాది మేలో ఏడుగురు విండో డైరెక్టర్లు  రాష్ట్ర కోఆపరేటివ్​ సొసైటీ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో  సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్ విచారణ అధికారిగా గత ఏడాది జూలై 20న లింగంపేట విండో రికార్డులను సీజ్​ చేశారు.  ఆదాయ, 

వ్యయాల బ్యాంక్​ స్టేట్​మెంట్లను తీసుకున్నారు. చైర్మన్​, సీఈఓ, డైరెక్టర్లను విడివిడిగా విచారించి సుమారు రూ.73లక్షల8వేల322 దుర్వినియోగం జరిగినట్లు నివేదిక ఇచ్చారని డీసీఓ  తెలిపారు.   సింగిల్​విండో మహాజనసభ ఏర్పాటు చేసి  నిధుల దుర్వినియోగంపై చర్చించి నివేదికను 20లోగా అందించాలని డీసీఓ ఆదేశాలు జారీ చేశారు.