సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్లో మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. కలెక్టర్ చాంబర్కు పక్కనున్న ఆడిటోరియం సమీపంలో మందుబాబులు మద్యం తాగి ఖాళీ బాటిళ్లను అక్కడే పడేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఆఫీసు టైం వరకు ఆ మద్యం బాటిల్ అక్కడే పడి ఉండడం కలకలం రేపుతోంది. గతంలోనూ కలెక్టరేట్ ఆవరణలో బీరు బాటిళ్లు దర్శనమివ్వగా అప్పట్లో కలెక్టర్ ఉద్యోగులను, మెయింటెనెన్స్ కాంట్రాక్టర్పై సీరియస్ అయ్యారు. తాజాగా ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటన జరిగింది.
- సంగారెడ్డి, వెలుగు
