
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు (ed)అదుపులోకి తీసుకున్నారు. . ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటీ? ఈ కుంభకోణంతో కవితకు (kavitha) సంబంధం ఏంటీ? సీబీఐ ఎందుకు విచారించింది? ఇప్పుడు ఈడీ (ed) ఎందుకు సోదాలు జరిపింది.. లిక్కర్ కేసు నేపథ్యం గురించి తెలుసుకుందాం. ..
2021 ముందు వరకు ఢిల్లీలో మద్యం దుకాణాలను అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే (arvind kejriwal) నిర్వహించేది. ఆ తర్వాత కొత్త లిక్కర్ పాలసీ (excise policy) తీసుకొచ్చింది. 2022 నవంబర్ 17వ తేదీన ఎక్సైజ్ పాలసీ అమలు చేశారు. పాలసీ అమలు చేయడానికి 2 రోజుల ముందు లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తన వైఖరి మార్చుకున్నారని అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చినా వీకే సక్సేనా ఎక్సైజ్ పాలసీ 2021-22లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఢిల్లీ విద్యాశాఖ, ఎక్సైజ్శాఖ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను (manish sisodia) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది.
మద్యం పాలసీలో క్విడ్ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఎక్సైజ్ అధికారులు, రాజకీయ నేతలకు కోట్ల రూపాయల ముడుపులు అందాయని పేర్కొంది. సిసోడియాకు అనుచరుడు దినేశ్ అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు కోటి రూపాయలు ముడుపులు అందాయని సీబీఐ తెలిపింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఢిల్లీలో ఉన్న 32 జోన్లలో 849 మద్యం షాపులు తెరవాల్సి ఉంది. ఒక్కో మండలంలో 27 మద్యం షాపులు ఉండేలా.. 8 నుంచి 10 వార్డులుగా విభజించారు. ఎక్సైజ్ పాలసీ నిబంధనలకు లోబడి మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్లో వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
ఒప్పందంలో భాగంగా హోల్ సేల్ లిక్కర్ కంపెనీల లాభాల వాటా 12 శాతం పెంచుతూ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు జరిగాయని ఈడీ తెలిపింది. తొలి మూడు స్థానాల్లో నిలిచి, లైసెన్స్ పొందిన ఇండో స్పిరిట్స్, బ్రిండ్ కో, మహదేవ్ లిక్కర్స్ వ్యాపారం రూ.3500 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 12 శాతం వాటా రూ.420 కోట్లు అయితే.. తిరిగి 6 శాతం రూ.210 కోట్లు ఆప్ నేతలకు ముడుపులు చెల్లించాలనే ఒప్పందంలో భాగం అని ఈడీ చెబుతోంది. పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈడీ తరఫున సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ రూ. 100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని పేర్కొంది. పిళ్లై రూ.296.2 కోట్ల మేర ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్స్ పాల్పడినట్టు పేర్కొంది.
మద్యం పాలసీలో ఒప్పందంలో భాగంగానే సమీరు మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్లో సౌత్ గ్రూపునకు దక్కిన 65 శాతం వాటాలో పిళ్లైకు 32.5 శాతం దక్కిందట. ఇతను కవిత బినామీ అని చెప్పింది. ఇండో స్పిరిట్ కంపెనీలో షేర్ హోల్డర్గా కవిత కాగితాల మీద చూపించడానికి రూ.3.20 కోట్లలో రూ.కోటి సమకూర్చారని తెలిపింది. 9 రిటైల్ జోన్లకు లైసెన్స్ రావడానికి పిళ్లై.. ఆప్ పెద్దలు, సౌత్ గ్రూపు సభ్యులకు మధ్యవర్తిగా వ్యవహరించారని అప్పట్లో వార్తలొచ్చాయి. . 2021 సెప్టెంబర్లో పిళమ్లై, బుచ్చిబాబు, అభిషేక్ తాజ్ మాన్ సింగ్ హోటల్లో బినయ్ బాబు, మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి లిక్కర్ వ్యాపారం గురించి డిస్కష్ చేశారని వివరించింది. హోటల్ రికార్డులు, వీడియో ఫుటేజీ ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో భేటీ అయ్యారని.. రూ.321 కోట్లను అభిషేక్, దినేశ్ అరారో కలిసి ఆప్కు బదిలీ చేశారని వివరించింది. 2021 మే నెలలో ఢిల్లీ గౌరి అపార్ట్ మెంట్ వద్ద జరిగిన సమావేశంలో పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు, ఆప్ నుంచి విజయ్ నాయర్ (vijay nair) పాల్గొన్నారని ఈడీ (ed) తెలిపింది. జూన్లో వీరు ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి మధ్య సమావేశం ఏర్పాటు చేశారని ఈడీ పేర్కొంది.