సిటీలో మద్యం షాపులు బంద్‌‌.. పోలింగ్​ సందర్భంగా 3 రోజులు మూసివేత

సిటీలో మద్యం షాపులు బంద్‌‌.. పోలింగ్​ సందర్భంగా 3 రోజులు మూసివేత

హైదరాబాద్‌‌,వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సిటీలో మద్యంషాపులు 3 రోజులు బంద్ ఉంటాయి. గురువారం జరిగే పోలింగ్‌‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ గ్రేటర్ పోలీసులు శనివారం నోటిఫికేషన్‌‌ విడుదల చేశారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. కౌంటింగ్‌‌ జరిగే 3న కూడా మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు. రూల్స్  పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.