2024 మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల విధులకు రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులతో పాటు విదేశీ ప్రయాణాల కోసం శాఖల అనుమతులు తీసుకున్న వారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆయన ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో భాగంగా పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బంది నియామక ఉత్తర్వులు జారీ చేసి నప్పటికీ సంభందిత శాఖల అధికారుల నుండి అనుమతి తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది కొరత ఏర్పడం వీరంతా వెంటనే రిపోర్ట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దీర్ఘకాలిక సెలవులతో పాటు, విదేశాలకు వెళ్లే అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ పేర్కొన్నారు.