మన బంధం కలకాలం ఉండాలి: మోడీ

మన బంధం కలకాలం ఉండాలి: మోడీ

భారత్ – అమెరికా స్నేహా బంధం వర్ధిల్లాలి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, మోతెరా మైదానంలో  నిర్వహిస్తోన్న ‘నమస్తే ట్రంప్’ సభలో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మైత్రీ బంధం కలకాలం వర్థిల్లాలని చెప్పారు. ఇరు దేశాల మైత్రీ బంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం పలుకుతున్నామని వెల్ కమ్ స్పీచ్ లో మోడీ అన్నారు.

మీకు స్వాగతం పలికిన భూమి గుజరాత్‌ ది అయినా.. ఉత్సాహం మాత్రం దేశం మొత్తానిది అని చెప్పారు మోడీ. అహ్మాదాబాద్‌లోని మోతెరా స్టేడియం నవచరిత్రకు నాంది పలుకుతోందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం  మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోందన్నారు. హ్యూస్టన్‌లో హౌడీ-మోదీ కార్యక్రమంలో నాంది పలికిందని, హౌడీ-మోదీ కొనసాగింపుగానే ‘నమస్తే ట్రంప్’ జరుగుతుందని తెలిపారు.

ఇండియా-యుఎస్ దేశాల సంబంధం చాలా గొప్ప మరియు దగ్గరి సంబంధం. ఒక దేశం స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచే దేశం కాగా.. మరో దేశం  ప్రపంచమంతా ఒకే కుటుంబమని నమ్ముతుందన్నారు. ఒకరు ‘ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ గురించి గర్వంగా భావిస్తారని, మరొకరు ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ గురించి గర్విస్తారని మోడీ అన్నారు.