
కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘లోపలికి రా చెప్తా’. జులై 5న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాక అందరిలోనూ భయం కలిగే ఉంటుంది. అయితే మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలోలాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని టీమ్కు బెస్ట్ విషెస్ అందిస్తున్నా’ అని అన్నారు. మరో అతిథిగా హాజరైన దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరారు.
వెంకట రాజేంద్ర మాట్లాడుతూ ‘నాలుగైదు జానర్స్ కలిపి ఈ మూవీకి స్క్రిప్ట్ చేశాను. హారర్, కామెడీతో పాటు యూత్ కు కావాల్సిన రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి’ అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి తదితరులు పాల్గొన్నారు.