శ్రీరాముడిపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాముడు తమ పార్టీకి చెందిన వాడేనని ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్లోని అజమ్గఢ్ నుంచి లక్నోకు వెళ్తున్న సమయంలో దారి మధ్యలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అయోధ్యలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా వారితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తాము రాముడితో పాటు కృష్ణుడి భక్తులమని అన్నారు అఖిలేశ్ యాదవ్.
అంతేకాదు ..త్వరలో కుటుంబంతో కలిసి అయోధ్యలోని రామ జన్మభూమిని సందర్శించనున్నట్లు తెలిపారు. శ్రీరాముడిని దర్శించుకుంటామని, తాము సరయూ నది ఒడ్డున లైటింగ్ తో పాటు భజన్ స్థల్ దగ్గర సౌండ్ సిస్టమ్ వంటి అభివృద్ధి పనులను చేశామని గుర్తు చేశారు అఖిలేశ్.