‘మైఖేల్’ కోసం 24 కిలోలు తగ్గాను : సందీప్

‘మైఖేల్’ కోసం 24 కిలోలు తగ్గాను : సందీప్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ‘సందీప్ కిషన్’ డిఫరెంట్ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకున్న సందీప్.. మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ‘మైఖేల్’ సినిమాలో హీరోగా నటించాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. ఇప్పటి వరకు కనిపించని లుక్ లో సందీప్ ఆకట్టుకుంటున్నాడు. ఈ మూవీ టీజర్ లో మాస్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టాడు.

ఈ సినిమా కోసం సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగా కష్టపడ్డాడని తెలుస్తోంది. టీజర్ చివర్లో ‘మన్నించేటప్పుడు దేవుడు అవుతాం మైఖేల్’ అని అంటే ‘నేను మనిషిగానే ఉంటాను మాస్టార్.. దేవుడవ్వాలనే ఆశ లేదు’ అని సందీప్ చెప్పడం మూవీపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, కోలీవుడ్ నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కూడా కీల‌క‌పాత్ర పోషించారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారు. సందీప్ కిషన్ సరసన దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్ గా నటించారు. యాంకర్ అనసూయ గ్లామరస్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ విడుదల కానుంది.

24 కిలోల బరువు తగ్గిన.. 
ఈ సినిమా కోసం దాదాపు 24 కిలోల బరువు తగ్గినట్లు టీజర్ విడుదల కార్యక్రమంలో సందీప్ వెల్లడించాడు. ‘మైఖేల్’ కోసం మూడు సంవత్సరాలు చాలా కష్టపడినట్లు చెప్పాడు. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారని అన్నారు. తాను విజయ్ సేతుపతితో కలిసి పని చేయడం చాలా గొప్పగా ఉందన్నారు. మైఖేల్ సినిమాతో తాము కొత్త ప్రయత్నం చేశామని తెలిపారు.