పేకాటలో ఓడిపోయి 5 వేల కోసం హత్య

పేకాటలో ఓడిపోయి 5 వేల కోసం హత్య

జగిత్యాల జిల్లా: పేకాటలో ఓడిపోవడం జీర్ణించుకోలేక ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని బండ రాళ్లతో కొట్టి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ 28వ తేదీన జరిగిన హత్యలో నిందితులను విచారించిన పోలీసులు పేకాటలో కేవలం 5వేల కోసం చంపినట్లు నిర్ధారించారు.  
జగిత్యాల తారకరామనగర్ కు చెందిన సమ్మయ్య, సారయ్య, కోరుట్ల కి చెందిన విజయ్ కలిసి గత నెల పేకాట ఆడారు. పేకాటలో డబ్బులు పోవడంతో సారయ్య, విజయ్ కలిసి సమ్మయ్యను తాటిపల్లి శివారులోని  పెద్దయ్య చెరువు దగ్గరకు  తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి చంపినట్టు పోలీసులు తేల్చారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ తెలిపారు.