ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతిచెందగా.. ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలలోకి వెళ్తే.. మెడికల్ రెప్రజెంటేటివ్‎గా పనిచేస్తున్న కోటి రెడ్డికి.. ఓ ఆస్పత్రిలో నర్స్‎గా విధులు నిర్వహిస్తున్న చైతన్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. అయితే వీరిద్దరూ.. తమ ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అందులో భాగంగా చందానగర్‎లోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ లవర్స్ ఇద్దరూ సూసైడ్‎కు ప్రయత్నించారు. ఈ క్రమంలో చైతన్య మృతిచెందింది. భయపడిన కోటిరెడ్డి లాడ్జీ నుంచి పారిపోయి.. ఒంగోలులో ప్రత్యక్షమయ్యాడు. ఒంటినిండా గాయాలతో అక్కడ ఓ హాస్పిటల్ లో చేరాడు. కాగా.. కోటిరెడ్డే ప్రియురాలిని చంపి ఈ నాటకమడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.