బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయాలి

బదిలీ అయిన  టీచర్లను రిలీవ్ చేయాలి

హైదరాబాద్, వెలుగు: మల్టీజోన్ 1లో బదిలీ అయిన టీచర్లను అలాట్ అయిన స్కూళ్లలో వెంటనే చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. 

ఇటీవల ఎల్ఎఫ్ఎల్​ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్ స్టెంట్లను బదిలీ చేసినా, ఇంకా  స్కూళ్ల నుంచి రిలీవ్ చేయలేదని చెప్పారు. వెంటనే వారందరినీ రిలీవ్ చేస్తూ  ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎల్ఎఫ్ఎల్​ హెడ్మాస్టర్లకు  రిలీవర్​తో సంబంధం లేదని, కొత్త స్కూళ్లలో చేరేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.