హైదరాబాద్, వెలుగు: మల్టీజోన్ 1లో బదిలీ అయిన టీచర్లను అలాట్ అయిన స్కూళ్లలో వెంటనే చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
ఇటీవల ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్, స్కూల్ అసిస్ స్టెంట్లను బదిలీ చేసినా, ఇంకా స్కూళ్ల నుంచి రిలీవ్ చేయలేదని చెప్పారు. వెంటనే వారందరినీ రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లకు రిలీవర్తో సంబంధం లేదని, కొత్త స్కూళ్లలో చేరేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.