
అలంపూర్/ఇటిక్యాల, వెలుగు : ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామంలో శుక్రవారం ఇంట్లో, ఇండ్ల ముందు ఉన్న ఐదుగురిపై పిచ్చికుక్క దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి గోపి, చలికే గోపాల్, మాసూమ్ బి, చాకలి మద్దమ్మ, వెంకటేశ్పై పిచ్చి కుక్క దాడి చేసింది. 108లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి సర్జరీ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చె ప్పారు.