న్యూఢిల్లీ, వెలుగు: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ గా మాజీ ఎంపీ, తెలంగాణ సీనియర్ నేత మధు యాష్కీకి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదంతో యాష్కీకి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన మాజీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి సేవలను అధిష్టానం ఈ సందర్భంగా కొనియాడింది.
