మార్పు కోసం ప్రజలు ఎదురుచుస్తున్నారు : మురళీనాయక్​

మార్పు కోసం ప్రజలు ఎదురుచుస్తున్నారు : మురళీనాయక్​

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మహబూబాబాద్ కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్​ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని శనిగపురం, బీసీ కాలనీ, ఎన్జీవోస్​కాలనీ, లెనిన్​నగర్​, ఇందిరానగర్ సహ పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్​ ప్రభుత్వం నిలయంగా మారిందన్నారు.

కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్​ దందా చేసి,   ఆడపడుచుల ఆత్మగౌరవన్ని తాకట్టు పెట్టిందన్నారు. కాంగ్రెస్​ హయాంలో ఉద్యోగులకు ఒకటోతారీఖు జీతాలు వస్తే...  నేడు నెలాఖారు వరకు కూడా జీతాలు పడడడం లేదన్నారు.  బీఆర్ఎస్​ గుండాలు, భూకబ్జాలు,  అక్రమ రియల్​ఎస్టేల్​ ​వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తి పేదలను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​, సీపీఐ నాయకులు దేవరం ప్రకాశ్​రెడ్డి, విజయసారధి, అజయ్​సారధి,  రామరాజు బిక్షపతి, వెంకట్​రెడ్డి, శంతన్​రామరాజు, హరిసింగ్​, సత్యనారాయణ, శ్రీహరి, లాలయ్య తదితరులు ఉన్నారు.