
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి శివారు అటవీ ప్రాంతంలో శనివారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రూరల్ ఎస్సై విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. అప్పనపల్లికి చెందిన పవన్ కుమార్ కొడుకు గణేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
దీంతో ఎదిరకు చెందిన క్షుద్రపూజలు చేసే కటికే పెంటోజిని కలిసి విషయం చెప్పడంతో అప్పన్నపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం వీరు ముగ్గురు కలిసి క్షుద్ర పూజలు చేసి ఒక కోడిని బలిచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.