మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు కరోనా పాజిటివ్

మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. లేటెస్టుగా ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన విషయాన్ని ఆదిత్య థాకరే స్వయంగా ప్రకటించారు. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు.

తనను కలిసినవాళ్లందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించి.. సురక్షితంగా ఉండాలని ప్రజలను కోరారు.