
కామారెడ్డిటౌన్, వెలుగు: జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్స్థానాల పోలీసు అబ్జర్వర్గా వచ్చిన రాజేశ్ మీనాతో ఆదివారం కామారెడ్డి కలెక్టర్ జితేష్వి పాటిల్, ఎస్పీ సింధూశర్మ జిల్లా కేంద్రంలో భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిరోజు తనిఖీలు, అంతర్జిల్లా, స్టేట్చెక్పోస్టుల్లో తనిఖీలు, బార్డర్స్టేట్ఆఫీసర్లతో కో ఆర్డినేషన్పై గురించి తెలిపారు. ఎన్నికల మీటింగ్లు, ప్రచారాలు నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. అడిషనల్ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు చంద్రశేఖర్రెడ్డి, రామన్తదితరులు ఉన్నారు.