
ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ బీఆర్ఎస్ ఎంపీటీసీ, ఆ పార్టీ మండల కార్యదర్శి, మంద సంజీవ్ఆదివారం బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ టికెట్ పై ఎంపీటీసీగా గెలిచిన మంద సంజీవ్ అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే తిరిగి ఆయన బీజేపీ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో తిరిగి చేరాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాశ్ రెడ్డి కోరడంతో మంద సంజీవ్ బీజేపీలో చేరారన్నారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్, మహేశ్ గౌడ్, చిలుక ప్రవీణ్ తదితరులున్నారు.