బీర్కూర్, వెలుగు: స్టూడెంట్లు టైమ్కు కాలేజీలకు వెళ్లలేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని, వారి కోసం ప్రత్యేక బస్సులు నడపాలని వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. పోచారం శుక్రవారం బాన్సువాడ నుంచి బీర్కూర్ మండలం తిమ్మాపూర్కు వెళ్తుండగా కిష్టాపూర్ వద్ద స్టూడెంట్లు బస్సు కోసం వేచి ఉండటాన్ని గమనించి తన వెహికల్ఆపి వారితో మాట్లాడారు.
బస్సులు సమయానికి రాకపోవడంతో కాలేజీకి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్పారు. దీంతో బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్తో ఫోన్లో మాట్లాడిన పోచారం.. బాన్సువాడ నుంచి ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీ వరకు బీర్కూర్, కిష్టాపూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్పల్లి చౌరస్తా మార్గంలో ఉదయం బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని సూచించారు.
బోనం ఎత్తుకున్న పోచారం
వర్ని, వెలుగు: ఆషాఢమాస బోనాల పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగలో పోచారం శ్రీని వాస్ రెడ్డి పాల్గొన్నారు. బోనం ఎత్తుకొన్నారు. పాడి పంటలతో ప్రజలు సల్లగా ఉండాలని, గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలని మొక్కుకున్నారు.
