బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి..

బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాకు మీద షాకులు తుగులుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి భువనగిరి లేదా నల్గొండ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.