ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క

ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క

వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మంత్రి సీతక్క.  ఏప్రిల్ 29వ తేదీ సోమవారం ఉదయం జిల్లాలో సీతక్క లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచే
సూర్యడు తన ఉగ్ర రూపాన్ని చూపుతున్నాడని.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి సూచించారు. కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని చెప్పారు

గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని...  ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని మంత్రి చెప్పారు. పెరగుతున్న ఉష్ణోగ్రతలు.. వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నందున  తగిన  జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  ఉదయం 9  గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లకే పరిమితమై నీడపట్టున  ఉండాలన్నారు.  ఆవసరమైతెనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సీతక్క ప్రజలకు తెలిపారు.