
రీసెంట్గా ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. తన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం వర్క్ షాప్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని, అన్ని అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ పార్ట్ను 2026 లో రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.