త్రివిక్రమ్ ఇంటర్వెల్ లోనే వెళ్ళిపోయాడు..దొరికితే కొట్టేవాళ్లమంటూ..ఆడియన్స్ ఫైర్

త్రివిక్రమ్ ఇంటర్వెల్ లోనే వెళ్ళిపోయాడు..దొరికితే కొట్టేవాళ్లమంటూ..ఆడియన్స్ ఫైర్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Gunturu kaaram). అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తరువాత ఈ కాంబో నుండి వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. 

భారీ అంచనాల మధ్య గుంటూరు కారం నేడు (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాత్రి ఒంటిగంట నుండే ప్రీమియర్స్ పడటంతో..సినిమా చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్, ఆడియన్స్ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. 

లేటెస్ట్గా ఈ సినిమా చూసిన ఆడియాన్స్..డైరెక్టర్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి చాలా చోట్ల నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్, సినీ లవర్స్ సినిమా మేకర్స్ ను ..ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ సినిమా చూసాక..డైరెక్టర్ తివిక్రమ్‌ను ఘోరంగా తిడుతున్నారు.

కొంతమందైతే..త్రివిక్రమ్ ఇంటర్వెల్ మధ్యలోనే వెళ్ళిపోయాడు..థియేటర్‌లో దొరికితే కొట్టేవాళ్లమంటూ..అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో, అజ్ఞాతవాసి ఇలా సినిమాలన్నింటిని కలిపి ఏదో ఒకటి తీసినట్లుగా ఉందని..కామెంట్స్తో నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం ఈ సినిమాల్లో స్టోరీ  ఏ మాత్రం లేదని..ఫైర్ అవుతూనే..ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందనేది రేపటి లోపు తెలుస్తోంది.