
ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం.. జనవరి 6వ తేదీ సాయంత్రం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు జనవరి 5వ తేదీ సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది నిర్మాత సంస్థ. జనవరి 12వ తేదీన గుంటూరు కారం సినిమా విడుదల అవుతుంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్ మొదలుపెట్టింది యూనిట్. అందులో భాగంగా జనవరి 6వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ముందుగానే ప్రకటించింది.. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అనూహ్యంగా.. 24 గంటల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్లు ప్రకటించటంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు.
Despite our best efforts, due to unforeseen circumstances and issues with security permissions, we will not be conducting the highly awaited #GunturKaaram Pre-release event on 6th January 2024. We sincerely apologize for this announcement ?
— Haarika & Hassine Creations (@haarikahassine) January 5, 2024
The new date for the event with the…
గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని భావించింది యూనిట్. పోలీస్ పర్మీషన్స్, సెక్యూరిటీ అనుమతులు రాకపోవటం వల్లే ఈవెంట్ రద్దయినట్లు తెలుస్తుంది. ఆల్ రెడీ జనవరి 5వ తేదీ వచ్చేసింది.. జనవరి 12వ తేదీ మూవీ రిలీజ్ఉంది.. ఈ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు.. ఎక్కడ నిర్వహిస్తారు అనేది ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు జోడీగా హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.