నా హృదయానికి దగ్గరగా ఉండే.. కలకాలం జ్ఞాపకం ఇది: మహేష్ బాబు ట్వీట్

 నా హృదయానికి దగ్గరగా ఉండే.. కలకాలం జ్ఞాపకం ఇది: మహేష్ బాబు ట్వీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) న‌టించిన‌ 'గుంటూరు కారం' (Guntur Kaaram) జనవరి 12న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మైంది. నిన్నగుంటూరులో జరిగిన  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. ఏవీ చూడగానే నాకు పాతిక సంవత్సరాలు అని తెలిసింది. ఇదివరకు నాకు తెలియదు. అదంతా మీరు చూపించిన అభిమానమే. మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప మరేమి తెలియదు.ఎప్పుడు చెబుతూ ఉంటానుగా..ఇకపై మీరే నాకు అమ్మా, నాన్న” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్.

లేటెస్ట్ గా మహేష్ ధన్యవాదాలు, గుంటూరు!! అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఇక్కడి మనుషులతో చాలా ఎనలేని బంధం ఉంది. చాలా ప్రేమతో చుట్టుముట్టబడిన నా స్వగ్రామంలో సినిమా వేడుక జరుపుకోవడం, నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక కలకాలం జ్ఞాపకం ఇది. మీ అందరినీ ఎప్పటికీ ప్రేమిస్తుంటాను..నా సూపర్ ఫ్యాన్స్ ను మళ్లీ మిమ్మల్ని చూడాలని ఎదురుచూస్తున్నాను..అతి త్వరలో మళ్ళీ కలుద్దాం!! ఇప్పుడు సంక్రాంతి ప్రారంభమవుతుంది!! గుంటూరు కారంతో ఎంజాయ్ చేద్దాం అంటూ ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా  నటిస్తున్నారు. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్  పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.