దేవుడు ఓదారుస్తున్నాడు.. నమ్రతతో ఖలేజా సీన్ రిపీట్

దేవుడు ఓదారుస్తున్నాడు.. నమ్రతతో ఖలేజా సీన్ రిపీట్

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)..భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar)పై మరోసారి తన ప్రేమను చాటే పిక్ షేర్ చేశాడు. ఆ ఫొటోలో మహేష్, నమ్రతని ప్రేమతో కౌగిలించుకొని ముద్దాడుతున్నారు. అందులో భాగంగా మహేష్ తన మనసులో మాటను చెబుతూ..నా కోసం అన్ని పనులను ఒక క్రమ పద్ధతిలో పెడుతున్నందుకు థ్యాంక్స్. నీ నవ్వు,నీ ప్రేమ, నీ సాహసం ఇవన్నీ ఎప్పటికీ పదిలం..హ్యాపీ న్యూ ఇయర్ లవ్ ..అంటూ విషెష్ తెలిపారు.

దీంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తున్నారు. అలాగే..మహేష్ షేర్ చేసిన ఫోటో..అచ్చం ఖలేజా సినిమాలోని ఓ సీన్ని రీ క్రియేట్ చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటది. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే..ఖలేజా సెకండ్ హాఫ్లో మహేష్..అనుష్క బ్రహ్మానందం ఇంటికి వెళతారు. ఇక అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే..మహేష్ ఆమెను ఓదారుస్తాడు.

ఆ సీన్లో మహేష్, అనుష్క స్టిల్..ఇప్పుడు నమ్రతతో మహేష్ షేర్ చేసిన స్టిల్ కూడా అచ్చం అలానే ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను..ఫ్యామిలీ ట్రిప్స్ వివరాలను తెలుపుతూ ఫ్యాన్స్లో జోష్ పెంచేస్తున్నాడు. ప్రసెంట్ ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్‌లో ఉన్నాడు మహేష్.  

వంశీ సినిమాలో మహేష్,నమ్రతాలు ఆన్‌ స్క్రీన్‌ జోడీగా చేశారు. అతర్వాత నిజజీవితంలో కూడా ఒక్కటైయ్యారు. 1993లో ఫెమీనా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న నమ్రత 2000లో ‘వంశీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత ‘అంజి’తో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించారు. ‘వంశీ’ సినిమా సమయంలో మహేశ్, నమ్రత ప్రేమించుకున్నారు. 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై ,చెప్పింది. వీరికి గౌతమ్,సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు.