మహేష్ నిర్మాతగా అడవిశేష్ సినిమా

మహేష్ నిర్మాతగా అడవిశేష్ సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా అడివిశేష్ హీరోగా న‌టిస్తున్న సినిమా ‘మేజ‌ర్‌’. 26/11..ముంబై తాజ్ హోటల్‌పై ముష్క‌రులు దాడి జ‌రిపిన రోజు. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎన్ఎస్‌జీ కమెండో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను ప్రాణాల‌ను కాపాడారు. ఈ రియ‌ల్ హీరో ఉన్ని కృష్ణ‌న్ పాత్ర‌లో అడివిశేష్ హీరోగా న‌టిస్తున్నాడు.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. శోభితా ధూళిపాల ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఆమె పాత్ర చాలా ప‌వ‌ర్‌ ఫుల్‌ గా, ఎమోష‌న‌ల్‌ గా ఆక‌ట్టుకోనుందని ఆమె పాత్ర గురించి శేష్ ట్వీట్ చేశాడు.

గూఢ‌చారి త‌ర్వాత శేష్‌ తో ధూళిపాల క‌లిసి న‌టిస్తోన్న రెండో సినిమా ఇది.  ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో షూటింగ్ జరుపుకుంటున్న  ఈ మూవీని .. ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేశ్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చ‌ర్స్‌, ఎప్ల‌స్ఎస్ మూవీస్ నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.