రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌‌‌‌ రెడ్డే ప్రధాన అడ్డంకి: మహేశ్ కుమార్ గౌడ్

రాష్ట్ర అభివృద్ధికి  కిషన్‌‌‌‌ రెడ్డే ప్రధాన అడ్డంకి: మహేశ్ కుమార్ గౌడ్
  • కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలడ్డుతున్నడు: పీసీసీ చీఫ్ ​మహేశ్‌‌ 
  • తెలంగాణలో బీజేపీకి చాన్స్‌‌ లేదు..
  • ప్రజామోదంతోనే  రెండేండ్ల పండుగ చేస్తున్నం
  • కేసీఆర్​ అప్పుల భారం లేకుంటే మరిన్ని స్కీమ్‌‌లు తెచ్చేవాళ్లమని వెల్లడి

నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డే ప్రధాన అడ్డంకి అని, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని పీసీసీ చీఫ్​ మహేశ్‌‌ కుమార్​ గౌడ్​ ఆరోపించారు. మెట్రో లైన్​ విస్తరణ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్​ ఫోర్త్​ సిటీ నిర్మాణానికి ఫండ్స్​ రాకుండా కిషన్‌‌రెడ్డి మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్​ నగరానికి వచ్చిన మహేశ్‌‌ కుమార్​ గౌడ్​ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ ​రెడ్డికి తెలంగాణపై ప్రేమ, ధ్యాసలేదని, అందుకే ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలోని జూబ్లిహిల్స్​ బైపోల్‌‌లో బీజేపీకి కనీసం డిపాజిట్​ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో బీజేపీకి చాన్స్​ లేదని, జూబ్లీహిల్స్​ ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు.

 సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో రెండేండ్ల ప్రజా పాలనతో ఖుషీగా ఉన్నామని జూబ్లీహిల్స్‌‌‌‌ ఉప ఎన్నిక రిజల్ట్‌‌‌‌తో ప్రజలు క్లారిటీ ఇచ్చారని మహేశ్‌‌‌‌గౌడ్​ అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ సిట్టింగ్​ సీటును కాంగ్రెస్‌‌‌‌కు అప్పగించి తమపై విశ్వాసాన్ని, బాధ్యతను పెంచారని అన్నారు. ఆ స్ఫూర్తితో రెండేండ్ల కాంగ్రెస్​ ప్రభుత్వ పండుగను ఘనంగా  నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్లోబల్​ సమిట్‌‌‌‌తో ప్రపంచ దృష్టిని తెలంగాణ వైపు మరోసారి ఆకర్షిస్తామన్నారు. బీఆర్ఎస్​ సర్కార్​ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రతి నెలా భరిస్తూ కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కేసీఆర్​ చేసిన ఆ అప్పులేకుంటే మరిన్ని స్కీమ్స్​​ అమలు చేసేవాళ్లమని చెప్పారు. కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీల్లో 80 శాతం ఇప్పటికే అమలు చేశామని, వచ్చే మూడేండ్లలో మిగితా వాటిని నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్లి.. మరోసారి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న మహేశ్‌‌‌‌​గౌడ్..​ పద్మశాలీ సంఘం వసతి గృహాల కొత్త కమిటీ ప్రమాణ స్వీకరణ ప్రొగ్రామ్‌‌‌‌కు హాజరయ్యారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ ఉన్నారు.