ఒకే వేదికపై రాజమౌళి, మహేష్ బాబు సందడి..రెండు కళ్ళు చాలవేమో!

ఒకే వేదికపై రాజమౌళి, మహేష్ బాబు సందడి..రెండు కళ్ళు చాలవేమో!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy vanga) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ కంటెంట్ తో అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ వంటి స్టార్ కీ రోల్స్లో కనిపిస్తున్నారు. 

లేటెస్ట్ ఆప్టేట్ మేరకు..ఈ మూవీ ప్రీ రిలీజ్  ఈవెంట్కు స్పెషల్ గెస్ట్స్ గా దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రాబోతున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. యానిమల్ మేకర్స్ రాజమౌళిని ఉద్దేశిస్తూ..కొందరు వీధుల్లో గర్జించవచ్చు..కొన్ని కొన్ని ప్రదేశాలలో గర్జించవచ్చు..కొన్ని కొన్ని చోట్ల గర్జించవచ్చు. కానీ ఈ మనిషి మాత్రం ప్రపంచవ్యాప్తంగా గర్జించగలడు..అంటూ ట్వీట్లో తెలిపారు. దీంతో ఫ్యాన్స్ సూపర్ సక్సెస్ కాంబోను చూడటానికి రెండు కళ్ళు చాలవేమో! అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ నవంబర్ 27న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ దూలపల్లి లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగనుంది. . 

 రీసెంట్గా 3 నిమిషాల లెన్త్ తో వచ్చిన ఈ వైల్డ్ ట్రైలర్ ఆడియన్స్ మతులు పోగొడుతోంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్ తో మొదలైన ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవల్ సీన్స్ అండ్ విజువల్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఒక్కో షాట్, ఒక్కో విజువల్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు యానిమల్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.