‘మేజర్’ ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు

 ‘మేజర్’ ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు

26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మేజర్ సినిమాలో అడవి శేష్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గా నటించాడు. 

శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు ప్రచార చిత్రాన్ని మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతరం ఉద్విగ్నంగా సాగింది.

మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో చేసిన పోరాటం వంటి కీలక ఘట్టాలను ట్రైలర్ లో చాలా చక్కగా చూపించారు. లుక్స్, నటనపరంగా అడవి శేష్ మేకోవర్ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోని పిక్చర్స్ ఫిల్స్మ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రకాశ్ రాజ్, రేవతి సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రుల పాత్రల్లో నటించారు. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్, మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తల కోసం..

పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై మహిళా నేతల నిరసన

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు