- షట్లర్లకు మలేసియా సవాల్
కౌలాలంపూర్: ఒలింపిక్ ఇయర్లోకి అడుగు పెట్టిన ఇండియా షట్లర్లు ఈ ఏడాది తొలి సవాల్ కు రెడీ అయ్యారు. మంగళవారం నుంచి జరిగే మలేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీలో టాప్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్పై అందరి ఫోకస్ ఉంది. ఇందులో రాణించి ఒలింపిక్ క్వాలిఫికేషన్ పాయింట్లు సొంతం చేసుకోవాలని ఈ ఇద్దరు ఆశిస్తున్నారు.
ఏప్రిల్ చివరి నాటికి టాప్16 నిలిచిన వాళ్లు ఒలింపిక్స్కు క్వాలిఫై అవుతారు. వరల్డ్ 8వ ర్యాంక్తో ఈ రేసులో ముందంజలో ఉన్న ప్రణయ్ తొలి రౌండ్లో డెన్మార్క్కు చెందిన ఆండ్రెస్ ఆంటోన్సెన్తో తలపడనున్నాడు. గత సీజన్లో నిరాశ పరిచిన లక్ష్య, శ్రీకాంత్కు ఈ టోర్నీ కీలకం కానుంది. సేన్ చైనాకు చెందిన వెంగ్ హాంగ్, శ్రీకాంత్ ఇండోనేసియాకు చెందిన ఆరో సీడ్ క్రిస్టీతో తమ పోరు ఆరంభించనున్నారు.
డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్పై అంచనాలున్నాయి. విమెన్స్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో, గాయత్రి–ట్రీసా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గాయం నుంచి కోలుకుంటున్న పీవీ సింధు ఈ టోర్నీకి దూరంగా ఉంది. దాంతో విమెన్స్ సింగిల్స్లో టోర్నీలో ఇండియా ప్రాతినిధ్యం లేకుండా పోయింది.