నేరెడ్మెట్, వెలుగు : మీ సురక్ష యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పోలీసులను వేగంగా సంప్రదించవచ్చని మల్కాజిగిరి సీపీ బి. సుమతి అన్నారు. బుధవారం నేరెడ్మెంట్పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురంలోని ప్రశాంత్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి సీపీ సుమతి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి, సీఐ సందీప్ కుమార్ పాల్గొన్నారు.
