మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్ గొడవలో.. మైనంపల్లి ఎంట్రీ

మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్ గొడవలో.. మైనంపల్లి ఎంట్రీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. మల్లారెడ్డి కాలేజీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సపోర్ట్ చేశారు. కళాశాల వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

  మేడ్చల్ మండలం మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయం లో నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  గత కొన్ని రోజులుగా అన్నంలో  పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.