మల్లారెడ్డి యూనివర్శిటీ స్టూడెంట్ .. లాలాగూడలో డిగ్రీ విద్యార్థిని సూసైడ్..

 మల్లారెడ్డి యూనివర్శిటీ స్టూడెంట్ .. లాలాగూడలో డిగ్రీ విద్యార్థిని సూసైడ్..



 మల్లారెడ్డి యూనివర్శిటీ స్టూడెంట్ .. లాలాగూడలో డిగ్రీ విద్యార్థిని సూసైడ్​..  
జీడిమెట్ల, వెలుగు: మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్​లో ఓ స్టూడెంట్​ సూసైడ్​ చేసుకున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సందనాల లీలా నాగవినయ్​దుర్గ(19) మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐఎంఎల్​ ఫస్ట్​ ఇయర్​ చదువుతూ వారి హాస్టల్​లోనే ఉంటున్నాడు. గురువారం ఉదయం క్లాసులకు వెళ్లి, మధ్యాహ్నం 12:30 గంటలకు హాస్టల్​కు భోజనం కోసం వచ్చాడు. విద్యార్థులంతా భోజనం చేసి కాలేజీకి వెళ్లగా, వినయ్​దుర్గ మాత్రం అక్కడే ఉన్నాడు. 

భోజనాల అనంతరం హాస్టల్​ వార్డెన్​ గదులను తనిఖీ చేస్తుండగా రూమ్​ నంబర్​ 10 లోపలి నుంచి తాళం వేసి ఉంది. వెంటిలేటర్​ నుంచి చూడగా వినయ్​దుర్గ టవల్​తో  ఫ్యాన్​కు ఉరేసుకుని కన్పించాడు. వెంటనే హాస్పిటల్​కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

లాలాగూడలో యువతి..

లాలాగూడ: లాలాగూడలో డిగ్రీ చదువుతున్న యువతి సూసైడ్​ చేసుకుంది. లాలాగూడలో నివాసముండే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ప్రమోద్ కుమార్ పెద్ద కూతురు మౌలిక(19) తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండియర్​ చదువుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్​ ఫ్యాన్​కు ఉరేసుకుంది. కొన్ని నెలలుగా మౌలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు మృతురాలి స్నేహితులు తెలిపారు.