కొత్త చట్టాన్ని ప్రజలపై రుద్దడమేంటి?

కొత్త చట్టాన్ని ప్రజలపై రుద్దడమేంటి?

కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆ చట్టంపై తమ పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయన్నారు. దానిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు.

కేంద్రం చట్టం తెచ్చి రాష్ట్రాలు అమలు చేయాల్సిందే అనడం సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కకు పెట్టి.. కొత్త చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం జాతి సంపదను అమ్ముకుంటూ వస్తోందని భట్టి ఆరోపించారు.