ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన దీదీ

ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన దీదీ
  • బెంగాల్ లోని అలీపురద్వార్ జిల్లాలో ఆదివాసీ మహిళలతో ఆడిన మమతా బెనర్జీ 
  • సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ
  • పెళ్లి కూతుర్లందరికీ చెరో రూ.25 వేలు అందజేసిన మమతా

ఉత్తర బెంగాల్ లోని అలీపురద్వార్ జిల్లాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించారు. అందులో భాగంగా ఒక సామూహిక వివాహ వేడుకలో హాజరైన ఆమె... భిన్నమైన దుస్తులు ధరించి, స్థానిక మహిళలతో పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ అందర్నీ అలరించారు. అంతే కాకుండా రూప శ్రీ ప్రాజెక్టులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వివాహిత బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే 512 జంటలకు పెళ్లిళ్లు చేసిన దీదీ... పెళ్లి కూతుర్లందరికీ చెరో రూ.25 వేలు అందజేశారు.