కాశ్మీర్ ఫైల్స్ పై మమతా సీరియస్ కామెంట్స్.. లీగల్ నోటీసులు పంపిన డైరెక్టర్

కాశ్మీర్ ఫైల్స్ పై మమతా సీరియస్ కామెంట్స్.. లీగల్ నోటీసులు పంపిన డైరెక్టర్

2022లో వచ్చిన  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’మూవీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోవలో వచ్చిన వచ్చిన సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమా కూడా దేశంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్‌ చేశాయి. పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కూడా ఈ సినిమాను బ్యాన్‌ చేసింది తృణముల్‌ కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మూవీపై సంచలన కామెంట్స్‌ చేసింది.

ఈ రెండు సినిమాలపై మమత స్పందిస్తూ.. "ది కాశ్మీర్ ఫైల్స్" అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్‌ అయ్యింది. అందుకే ది కేరళ స్టోరీ సినిమాను రాష్ట్రంలో బ్యాన్‌ చేసినట్టు ఆమె తెలిపింది. అయితే.. మమత బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి సీరియస్‌ గా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు.. మమతకు లీగల్‌ నోటీస్‌ కూడా పంపించారు. తాన సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’పై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే ఆమెకు లీగల్‌ నోటీస్‌ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు.

తాను తీసిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాతోపాటు తన రాబోయే సినిమా కూడా పశ్చిమబెంగాల్‌లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని సీఎం మమత ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని వివేక్‌ అగ్నిహోత్రి పేర్కొన్నాడు. మరి వివేక్‌ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపడంపై మమతా బెనర్జీ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి మరి.

https://twitter.com/vivekagnihotri/status/1655841535236227073

https://twitter.com/ANI/status/1655540853212069892