బెంగాల్ లో కాదు.. ఢిల్లీలో మార్పొస్తది

బెంగాల్ లో కాదు.. ఢిల్లీలో మార్పొస్తది

పశ్చిమ బెంగాల్ లో మార్పు రాబోతోందన్న ప్రధాని మోడీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. మార్పు బెంగాల్ లో కాదు.. ఢిల్లీలో రాబోతోందని చెప్పారు. బెంగాల్ మహిళలకు భద్రత లేదని చెబుతున్న మోడీ.. యూపీ, బిహార్ రాష్ట్రాలను చూడాలన్నారు. బీజేపీ ఓట్లు కొనాలని చూస్తోందన్న మమతా బెనర్జీ.. డబ్బులు తీసుకుని తృణమూల్ కు ఓటేయాలని కోరారు. గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సిలిగురిలో భారీ ర్యాలీ నిర్వహించాక ఆమె మాట్లాడారు.